భారతదేశం, మే 28 -- 8th Pay Commission latest news : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలకు సంబంధించి ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇటీవలి వారాల్లో వివిధ ఉద్యోగ సంఘాలు జీతాల పెంపు, ఫార్ములాలపై ప్రభుత్వ కమిటీకి పలు ప్రతిపాదనలు సమర్పించాయి. అయితే, తాజా నివేదికల ప్రకారం.. ఉద్యోగ సంఘాలు కోరుతున్న అన్ని డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించే అవకాశం లేదని తెలుస్తోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం భారీ పెంపునకు కాకుండా మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

దేశవ్యాప్తంగా దాదాపు 1.1 కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాలపై 8వ వేతన సంఘం ప్రభావం చూపనుంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కొత్త వేతన సంఘాన్ని ఏర్పాటు చేసే సాంప్రదాయం ప్రకారం.. కేంద్ర ...