భారతదేశం, ఆగస్టు 22 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో భారీ వేతన పెంపుపై చర్చ జోరందుకుంది. రక్షణ శాఖ ఉద్యోగుల సమాఖ్య అయిన 'భారతీయ ప్రతిరక్ష మజ్దూర్ సంఘ్' (బీపీఎంఎస్).. 8వ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) సిఫార్సుల కోసం ఒక అత్యంత కీలకమైన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం 7వ వేతన సంఘం కింద ఉన్న కనీస వేతనం రూ.18,000ను, ఏకంగా రూ.72,000కు పెంచాలని ఈ ఫెడరేషన్ సిఫార్సు చేసింది. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే, ప్రస్తుత బేసిక్ పేతో పోలిస్తే ఏకంగా 300 శాతం మేర భారీ పెంపు లభించినట్లవుతుంది!

గత ఏప్రిల్ 16న ఈ డ్రాఫ్ట్ ప్రపోజల్‌ను అధికారికంగా విడుదల చేసినట్లు బీపీఎంఎస్ జనరల్ సెక్రటరీ రవీంద్ర కుమార్ మిశ్రా వెల్లడించారు. కనీస వేతనం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, వార్షిక ఇంక్రిమెంట్లు, కొత్త పే మ్యాట్రిక్స్ వంటి సమగ్ర అంశాలను ఈ ప్రతిపాదనలో స్పష్టంగా...