భారతదేశం, జూలై 13 -- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం ఏర్పాటై అప్పుడే ఎనిమిది నెలలు గడిచిపోయాయి. నిర్దేశిత 18 నెలల కాలపరిమితిలో ఇప్పుడు కమిషన్ చేతిలో మరో 10 నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ లోపే ఉద్యోగుల వేతనాలు, అలొవెన్సులు, పెన్షన్లు, ఇతర సేవా నిబంధనలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే కమిషన్ జులై 6-7 తేదీల్లో భువనేశ్వర్‌లో, ఆ తర్వాత జులై 9-10 తేదీల్లో కోల్‌కతాలో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాలను సేకరించింది.

సాధారణంగా పే కమిషన్ అనగానే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుంది? జీతాలు ఎంత పెరుగుతాయి? అనే చర్చ మాత్రమే అందరిలో నడుస్తుంది. కానీ, ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గెజెట్ నోటిఫికేషన్‌ను నిశ...