భారతదేశం, మార్చి 2 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచలనాలు మారితే అది అందరి మీద ప్రభావం చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు, కేతువులు ఎప్పుడూ కూడా తిరోగమనంలోనే పయనిస్తారు. ఫిబ్రవరి 26న బుధుడు కూడా తిరోగమనంలోకి వెళ్తాడు. మార్చి 20 వరకు బుధుడు తిరోగమనంలోనే పయనిస్తాడు. బుధుడు డబ్బు, జ్ఞానం మొదలైన వాటికి కారకుడు. గురువు డిసెంబర్ 5 వరకు అతిరోగమనంలోనే ఉంటాడు.

మార్చి 11 వరకు గురువు తిరోగమనంలోనే పయనిస్తాడు. ఈ హోలీకి నాలుగు గ్రహాలు తిరోగమనంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు కూడా భారీ లాభాలు వస్తాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. హోలీకి సంతోషం కూడా పెరుగుతుంది. ప్రమోషన్లు పొందుతారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

రాహువు హోలీ నాడు తిరోగమనంలో ...