భారతదేశం, జూన్ 11 -- 370 Biryani Joke Controversy: కామెడీ పేరిట మహిళల గౌరవానికి భంగం కలిగించేలా, మృతదేహాలను కూడా అగౌరవపరిచేలా మాట్లాడిన ముగ్గురు స్టాండప్ కమెడియన్లు ఇప్పుడు లీగల్ చిక్కుల్లో పడ్డారు. గురుగ్రామ్‌లో జరిగిన ఓ కామెడీ షోలో ప్రణిత్ మోరే, హిమాన్షు జంగ్లా, డాక్టర్ సెజల్ పవార్ చేసిన వ్యాఖ్యల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఫుల్ ఫైర్ అయ్యారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్పందించగా, మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు వీరిపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.

ఈ రచ్చకు కారణం హిమాన్షు జంగ్లా చేసిన ఒక అభ్యంతరకరమైన జోక్. "డేటింగ్‌కు వెళ్లినప్పుడు ఒక మహిళపై రూ.370 ఖర్చు పెడితే, దానికి ప్రతిఫలంగా ఆమెతో ఫిజికల్ రిలేషన్ పొందే హక్కు పురుషుడికి ఉంటుంది" అనే అర్థం వచ్చేలా అతను మాట్లాడాడు.

మహిళల సమ్మతిని (Consent) అస్సలు పట్...