భారతదేశం, జూన్ 11 -- Serial Actress Rashami Desai On Rs.370 Biryani Controversy: సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, కాసేపు నవ్వుల కోసం కమెడియన్లు చేసే 'క్రౌడ్ వర్క్' (ప్రేక్షకులతో మాట్లాడటం) షోలు ఒక్కోసారి హద్దులు దాటుతుంటాయి. తాజాగా రూ. 370 చికెన్ బిర్యానీ చుట్టూ ముసురుకున్న వివాదం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఒక అమ్మాయితో డేటింగ్‌కు వెళ్లి 370 రూపాయల బిర్యానీ తినిపించినందుకు, ఆ డబ్బును వసూలు చేసుకునేందుకు ఆమెను బలవంతంగా చీకటి పార్కుకు తీసుకెళ్లానంటూ ఓ యువకుడు నవ్వుతూ చెప్పిన మాటలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. మహిళల భద్రతను, వారి అంగీకారాన్ని హేళన చేసేలా సాగిన ఈ ఉదంతం తీవ్ర రూపం దాల్చడంతో సదరు యువకుడు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు.

గుర్గావ్‌కు చెందిన 23 ఏళ్ల హిమాన్షు జంగ్రా అనే యువకుడు ప్రముఖ కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన ...