భారతదేశం, జూన్ 24 -- 33 డిగ్రీల ఎండలో ఒక వ్యక్తి తలకు హుడీ వేసుకుని తిరగడం.. పూణే రూరల్ పోలీసుల అనుమానానికి బీజం వేసింది. లోహ్‌గఢ్ కోటపై ప్రమాదవశాత్తు పడి మరణించాడనుకున్న 25 ఏళ్ల యువ వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ కేసు.. చివరకు పక్కా స్కెచ్‌తో జరిగిన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కలిసి ఈ కుట్రకు పాల్పడ్డారని లోనావాలా రూరల్ పోలీస్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయడే వివరించారు.

కేతన్ అగర్వాల్ మంచి ట్రెకర్ అని, అంత సులభంగా లోహ్‌గఢ్ కోటపై నుంచి జారిపడే అవకాశం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు గట్టిగా చెప్పారు. దీంతో ప్రమాద కోణాన్ని పక్కనబెట్టి పోలీసులు దర్యాప్తు తీవ్రం చేశారు. జూన్ 18 ఉదయం అక్కడ 33 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కోట కింద ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించినప్పుడు, తీవ్రమైన...