భారతదేశం, జూలై 7 -- ప్రకృతిని పరిరక్షించాలనే సంకల్పంతో చేపట్టిన 'వనమహోత్సవం-2025' కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఘనంగా ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో రుద్రాక్ష మొక్కను నాటి ఈ కార్యక్రమం ప్రారంభించారు. మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "వనమే మనం. మనమే వనం అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. ప్రకృతిని మనం కాపాడుకుంటే, ప్రకృతి మనల్ని కాపాడుతుంది" అంటూ పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను నొక్కి చెప్పారు.
ఈ ఏడాది తెలంగాణ వ్యాప్తంగా 18 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.