భారతదేశం, జూలై 10 -- ఫోన్ వినియోగదారులకు టెలికాం నిరోధక నియంత్రణ సంస్థ (ట్రాయ్) కీలక స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, ఇతర నియంత్రిత సంస్థలు పౌరులతో జరిపే అధికారిక సమాచార మార్పిడి కోసం కేటాయించిన 1600 సిరీస్ ఫోన్ కాల్స్‌ను ఎలాంటి యాప్స్ ద్వారా బ్లాక్ చేయడం గానీ, స్పామ్‌గా ట్యాగ్ చేయడం గానీ కుదరదని ప్రకటించింది. అలాగే ప్రకటనల కోసం వచ్చే 140 సిరీస్ కాల్స్‌ను కూడా థర్డ్ పార్టీ యాప్స్ ఫిల్టర్ చేయలేవని, వినియోగదారులు కేవలం అధికారిక డీఎన్‌డీ రిజిస్ట్రీ ద్వారా మాత్రమే వాటిని నిలిపివేయగలరని పేర్కొంది.

టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్స్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్ (TCCCPR) నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు చేరే ముఖ్యమైన సమాచారం నమ్మకమైనదిగా ఉండాలనే ఉద్దేశంతోనే 1600 సిరీస్‌ను కేటాయించినట్లు నియంత్రణ సంస్థ వివరించింది....