భారతదేశం, జనవరి 26 -- చాలా కాలంగా ఎదురుచూస్తున్న భారత్ - ఐరోపా సమాఖ్య (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్​టీఏ) ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ ఒప్పందంలో భాగంగా ఐరోపా నుంచి దిగుమతి అయ్యే కార్లపై భారత్ భారీగా సుంకాలను తగ్గించనుందని ఓ అంతర్జాతీయ మీడియా నివేదిక వెల్లడించింది. బహుశా మంగళవారం నాడే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

తాజా ప్రతిపాదనల ప్రకారం, ఐరోపాలో తయారై 15,000 యూరోల (సుమారు రూ. 13.5 లక్షలు) కంటే ఎక్కువ ధర కలిగిన ప్యాసింజర్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని ప్రస్తుతమున్న 110% గరిష్ట స్థాయి నుంచి 40%కి తగ్గించనున్నారు. కాలక్రమేణా ఈ సుంకాన్ని మరింతగా తగ్గించి 10%కి పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ వంటి ప్రముఖ ఐరోపా తయారీదారులకు భారత మార్కెట్లోకి సులభంగా ప్రవేశి...