భారతదేశం, జూన్ 8 -- ఆంధ్రప్రదేశ్‌లో అత్యవసర వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తూ, ప్రభుత్వం 108 అంబులెన్స్ సేవలను అత్యాధునిక సాంకేతికతతో ఆధునీకరించింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన స్పందన, మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేశారు.

ఒక అధికారిక ప్రకటన ప్రకారం... 108 సర్వీస్ జూన్ 2025 నుండి మే 2026 మధ్య కాలంలో రికార్డు స్థాయిలో 7,78,799 కేసులను విజయవంతంగా నిర్వహించింది. ప్రమాదాలు జరిగినప్పుడు అత్యంత కీలకమైన 'గోల్డెన్ అవర్'లో బాధితులకు సకాలంలో వైద్యం అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ వ్యవస్థను ప్రక్షాళన చేసింది.

సరికొత్తగా రూపుదిద్దుకున్న 108 అంబులెన్స్ వాహనాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, ఆసుపత్రులతో మెరుగైన సమన్వయం కోసం పలు సాంకేతికతలను జోడించారు. జీపీఎస్ ఆధారిత వెహికల్ ట్రాకింగ్.. అంబులెన్స్ ఎక్కడ ఉందో ఖచ్చితంగా ప...