భారతదేశం, మే 3 -- కరీంనగర్ నగరం నడిబొడ్డున పట్టపగలే గన్లతో హల్‌చల్ చేశారు దుండగులు. పీఎంజే నగల దుకాణంలో కాల్పులకు తెగబడి దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ టెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. అంతేకాదు నిందితుల ఆచూకీ నగదు బహుమతి కూడా అందుకోవచ్చు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే క్లూస్ టీంతో రంగంలోకి దిగారు. దుకాణంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషించిన పోలీసులు, ఐదుగురు నిందితుల ఫోటోలను గుర్తించి వాటిని విడుదల చేశారు. నిందితుల జాడ కనిపెట్టిన వారికి లేదా వారి గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ. 1,00,000 (లక్ష రూపాయలు) బహుమతిగా అందజేస్తామని పోలీసులు ప్రకటించారు.

నిందితులు పక్క రాష్ట్రాలకు పారిపోకుండా సరిహద్దుల వద్ద తనిఖీలు...