భారతదేశం, జూన్ 16 -- బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ ఏఐ స్టార్టప్ 'సర్వం' గ్లోబల్ టెక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. తన సిరీస్ బి నిధుల సేకరణలో భాగంగా తొలి విడతలోనే 234 మిలియన్ డాలర్లను (సుమారు రూ.1,950 కోట్లు) రాబట్టింది. మొత్తం 300 మిలియన్ డాలర్ల నిధుల సేకరణను లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ ప్రస్తుత మార్కెట్ విలువ 1.5 బిలియన్ డాలర్లకు (రూ.12,500 కోట్ల పైమాటే) చేరింది. దేశీయంగా సొంత సాంకేతికతతో ఏఐ రంగాన్ని బలోపేతం చేయాలనే భారత ఆకాంక్షలకు ఈ పెట్టుబడులు మరింత ఊతాన్ని ఇస్తున్నాయి.

ఈ నిధుల సేకరణకు ప్రముఖ ఐటీ సేవల దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCL Technologies) నాయకత్వం వహించింది. సర్వం స్టార్టప్‌లో 10.46 శాతం వాటాను దక్కించుకుంటూ హెచ్‌సీఎల్ ఏకంగా 150 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది. నియంత్రణ సంస్థల ఫైలింగ్స్ ప్రకారం...