భారతదేశం, మే 27 -- 'ఆయన ఇప్పుడు ఆ పరమశివుడి పాదాల చెంత, ఆ కైలాసంలోనే ఉండిపోయారు.. ఆయన ఆత్మకు అదే ప్రశాంతతనిస్తుంది..." ఎవరెస్ట్ పర్వాతారోహణ ముగించుకుని, తిరుగుప్రయాణంలో వస్తుండగా కన్నుమూసిన హైదరాబాద్ పర్వతారోహకుడు అరుణ్ కుమార్ తివారీ (53) కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు ఇవి. అరుణ్ కుటుంబ సభ్యులు అత్యంత భారమైన హృదయంతో తీసుకున్న నిర్ణయం ఇది. ప్రమాదకరమైన పరిస్థితుల నేపథ్యంలో ఆయన భౌతికకాయాన్ని ఎవరెస్ట్ పర్వతంపైనే వదిలివేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.

తెలంగాణకు చెందిన అరుణ్ కుమార్ తివారీ ఒక ఐటీ ప్రొఫెషనల్. పర్వతారోహణపై ఉన్న మక్కువతో గత వారం ఆయన ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. అయితే, సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. శిఖరం నుంచి కిందకు దిగుతుండగా 'హిల్లరీ స్టెప్' అనే ప్రమాదకరమైన ప్రాంతంలో ఆయన అస్వస్థతకు గురై మరణించారు.

అర...