Telangana,hyderabad, ఆగస్టు 3 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్ట్ 2వ తేదీతో స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన విద్యార్థులు. ఆగస్ట్ 3వ తేదీలోపు కాలేజీల ఎంపిక పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

దోస్త్ స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఇవాళ్టితో వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఇంటర్ స్కోర్ తో పాటు వెబ్ ఆప్షన్ల ఆధారంగా..ఆగస్టు 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

దోస్త్ స్పెషల్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 6 నుంచి ఆన్ లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు ఆగస్టు 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆగస్టు 6 నుంచే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 8 తోనే ఈ సమయం కూడా ముగుస్తుంది. దోస్త్...