భారతదేశం, ఫిబ్రవరి 13 -- భారతదేశంలో సబ్-కాంపాక్ట్ SUVల మధ్య పోటీ ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దిగ్గజ కంపెనీలు సవాల్ విసురుతున్నా, తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue). కేవలం తన సెగ్మెంట్‌లోనే కాకుండా, దేశంలోని మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్‌లోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడళ్లలో ఒకటిగా వెన్యూ నిలిచింది.

ఇటీవలే కొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లతో అప్‌డేట్ అయిన ఈ కారుకు మార్కెట్లో భారీ డిమాండ్ కనిపిస్తోంది. నవంబర్ 2025 నుంచి ఇప్పటివరకు ఏకంగా 80,000కు పైగా బుకింగ్స్ రావడం చూస్తే, భారతీయులకు ఈ కారుపై ఉన్న మక్కువ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆకర్షణీయమైన ధర, లెవల్ 2 ADAS సేఫ్టీ సిస్టమ్, ప్రీమియం ఇంటీరియర్స్ ఈ కారుకు ప్లస్ పాయింట్లుగా మారాయి. ఇంతకీ వెన్యూ అంతగా పాపులర్ అవ్వడానికి ప్రధాన కారణ...