భారతదేశం, జూలై 18 -- సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన 36వ మంత్రి మండలి సమావేశం జరిగింది. అనేక అంశాలమీద సుదీర్ఘంగా చర్చించి, పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. తెలంగాణలో హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ కనెక్టివిటీపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. హైదరాబాద్-పుణె-ముంబయి, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై రూట్‌ హైస్పీడ్ రైళ్లను కేంద్రం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు హైస్పీడ్ రైలు కారిడార్ల ఎలైన్‌మెంట్, స్టేషన్లు, డిపోలకు సంబంధించి సవరించిన ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

శంషాబాద్ సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్, డిపో కోసం 400 ఎకరాల భూమిని కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫైనల్ ఎలైన్‌మెంట్‌ను హెచ్ఎండీఏ, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో చేర్చాలని తెలిపింది. భూసేకరణ, యుటిలిటీల మార్పిడి, పలు శాఖ...