భారతదేశం, సెప్టెంబర్ 19 -- హైదరాబాద్ నగర శివార్లలో శనివారం తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సహా మొత్తం ఏడుగురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. గణేష్ నిమజ్జనం పూర్తి చేసుకుని ఇళ్లకు తిరుగుపయనం అవుతున్న సమయంలో, వాహనం టైరు మార్చుకుంటుండగా ఈ ప్రమాదాలు జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది.

జాతీయ రహదారి-44 (NH-44) పై శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలమాకుల గ్రామం వద్ద మొదటి ప్రమాదం సంభవించింది. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం మెట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు తమ గ్రామంలో గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొని, తిరిగి కారులో శంషాబాద్‌లోని తమ నివాసానికి బయలుదేరారు. పాలమాకుల వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస...