భారతదేశం, జూలై 4 -- భాగ్యనగరంలో మెట్రో రైళ్లలో రద్దీ సమయాల్లో (పీక్ అవర్స్‌లో) ప్రయాణించే వారికి మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు. తెలంగాణ ప్రభుత్వ ఫేజ్-1 ప్రాజెక్ట్ బదిలీ ప్రక్రియ సుదీర్ఘంగా సాగుతుండటంతో మెట్రోకు రావాల్సిన 60 కొత్త కోచ్‌ల చేరిక కనీసం మరో రెండేళ్ల పాటు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా ప్రాజెక్ట్ బదిలీ అయిన వెంటనే.. బెంగళూరుకు చెందిన భారత్ ఎర్త్ మూవర్స్ సంస్థతో చర్చలు జరిపి అదనపు కోచ్‌లను ఆర్డర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ మెట్రో ప్రాజెక్ట్‌కు సంబంధించి సరికొత్త విలువ కట్టాలని (ఫ్రెష్ వాల్యుయేషన్) ఆదేశించడంతో ప్రక్రియ నిలిచిపోయింది. దీనివల్ల కోచ్‌ల కొనుగోలుతో పాటు ఇతర కీలక నిర్ణయాలు కూడా వాయిదా పడ్డాయి.

ఈ ప్రాజెక్ట్ వాల్యుయేషన్ బాధ్యతలను, ఆర్థిక ప...