భారతదేశం, జూన్ 21 -- హైదరాబాద్ నగరంలోని ప్రముఖ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడమే లక్ష్యంగా ఆదివారం ఉదయం 10:00 గంటల నుండి 'వన్-వే' ట్రాఫిక్ ట్రయల్ రన్ ప్రారంభించారు. ఈ ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాల గురించిన పూర్తి వివరాలు కింద ఉన్నాయి.

జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మూసివేత ఈ వన్-వే నిర్వహణలో భాగంగా జుబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మీదుగా వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు.

పంజాగుట్ట టు మాదాపూర్ రూట్: పంజాగుట్ట వైపు నుండి మాదాపూర్ వెళ్లే వాహనాలను బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, ఫిల్మ్ నగర్ రోడ్ నెం. 45 మీదుగా దారి మళ్లించారు. వాహనదారులు ఈ ట్రాఫిక్ మార్పులను గమనించి, అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు...