భారతదేశం, ఆగస్టు 18 -- హైదరాబాద్ లోని శ్రీ కృష్ణాష్టమి వేడుకల వేళ ఊహించని ఆదివారం అర్థరాత్రి విషాదం చోటు చేసుకుంది. ఉప్పల్ - రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.

ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఐదుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి వేర్వురు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

కృష్ణ యాదవ్ ( 24), శ్రీకాంత్ రెడ్డి (35), సురేష్ యాదవ్ (34), రుద్ర వికాస్ (39), రాజేంద్ర రెడ్డి (39)ని మృతులుగా గుర్తించారు. వీరి మృతదేహాలను శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ పరిణామంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద...