భారతదేశం, మే 27 -- బక్రీద్ పండుగను పురస్కరించుకుని నగరంలో మేకలు, గొర్రెల విక్రయాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులకు ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ మే 27, మే 28 తేదీల్లో నగరంలోని పలు కీలక ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు మరియు మళ్లింపులను ప్రకటించింది. ముఖ్యంగా సాయంత్రం 5:00 గంటల నుండి తెల్లవారుజామున 4:00 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. టోలిచౌకి - నానల్ నగర్ - రేతిబౌలి ఇరువైపులా, అలాగే రేతిబౌలి - అత్తాపూర్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు.

రాత్రి వేళల్లో మెహదీపట్నం - టోలిచౌకి రూట్‌లోకి రాకుండా, ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా వెళ్లాలని పోలీసులు సూచించారు.

ముఖ్య ప్రార్థనా స్థలాలైన మీర్ ఆలం ఈద్గా, సికింద్రాబాద్ ఈద్గా పరిసరాల్లో కూడా పండుగ రోజు ఉదయం పూట ప్రత్యేక ఆంక్షలు ఉంటాయి.

ప్రయాణ ...