భారతదేశం, జూన్ 11 -- పరీక్షలకు సంబంధించిన లోపాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ, న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. వారం రోజుల తర్వాత ఆ పార్టీ దేశవ్యాప్తంగా వరుస శాంతియుత నిరసన కార్యక్రమాలను ప్రకటించింది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో కూడా నిరసన జరగనుంది.

తాజాగా సీజేపీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 11, జూన్ 20 మధ్య ఏడు నగరాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో నిరసన కార్యక్రమం జూన్ 14న ఉదయం 10 గంటలకు ధర్నా చౌక్ వద్ద జరుగుతుంది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల పేపర్ లీకేజీలు, సీబీఎస్‌ఈ మార్కింగ్ విధానంలో అవకతవకలపై దేశ రాజధాని దిల్లీలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. సోషల్ మీడియా వేద...