భారతదేశం, జూలై 27 -- రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిర్ణీత గడువులోగా క్షమాపణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయనందున, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే మార్చాలని తెలంగాణ హైకోర్టు సీఎస్‌ను ఆదేశించింది. లోతుకుంటకు సంబంధించిన భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశం వెలువడింది.

లోతుకుంటలోని భూ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే మార్చాలని హైకోర్టు సీఎస్‌ని ఆదేశించింది. గతంలో సోమవారం లోగా లిఖితపూర్వక అఫిడవిట్ ద్వారా క్షమాపణ చెప్పాలని తెలంగాణ హైకోర్టు రంగనాథ్‌ను ఆదేశించింది. అయితే హైడ్రా తరఫు న్యాయవాది, క్షమాపణకు బదులుగా త్వరలో ఒక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అడ్వకేట్ జనరల్ జోక్యం తర్వాత, అఫిడవిట్ దాఖలు చేయడం కోస...