భారతదేశం, ఫిబ్రవరి 8 -- సినీ నటుడు, డ్రింకర్ సాయి మూవీ హీరో, జిస్మత్ మండీ అధినేత ధర్మ మహేష్ తన వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇప్పుడు బెంగళూరులోని మారతహాళ్లిలో తమ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించారు ధర్మ మహేష్.

భోజనం ప్రియులకు ప్రీమియం ఫుడ్ అందిస్తూ చాలా వేగంగా ఎదుగుతున్న జిస్మత్ బిర్యానీ తన కొత్త ఔట్ లెట్‌ను ఘనంగా ప్రారంభించింది. అత్యంత నాణ్యతతో కూడిన నోరూరించే వంటకాలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా సినీ నటుడు ధర్మ మహేష్ మాట్లాడుతూ.. "జిస్మత్ అనే పేరు నా కుమారుడు పేరులోని భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది నా జీవితంలోనే కాకుండా బ్రాండ్ ప్రయాణంలోనూ ఒక కొత్త అధ్యయనానికి ఆరంభంగా భావిస్తాను. జిస్మత్ లెగసి.. జగద్వాజ.. ఈ ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది" అని అన్నారు.

ఇంకా...