భారతదేశం, మార్చి 26 -- మధ్యప్రాచ్యంలో యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరిగింది. ప్రపంచ దేశాల ఇంధన అవసరాల్లో దాదాపు ఐదో వంతు తీర్చే కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ అదుపులోకి తీసుకుంది. అయితే, ఇందులో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. భారత్ సహా తన మిత్రదేశాల నౌకలకు మాత్రమే ఈ మార్గం గుండా వెళ్లేందుకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిగిలిన దేశాల నౌకలను అడ్డుకుంటామని స్పష్టం చేసింది.

గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ గురువారం ఈ సంచలన ప్రకటన చేశారు. "హార్ముజ్ జలసంధిని మేము పూర్తిగా మూసివేయలేదు. కేవలం మా శత్రువులకు మాత్రమే ఈ మార్గాన్ని నిలిపివేశాం. భారత్, చైనా, రష్యా, ఇరాక్, పాకిస్థాన్ వంటి మిత్రదేశాల నౌకలకు ఇక్కడ ఎలాంటి అభ్యంతరం ఉండదు" అని ఆయన స్పష్టం చేశారు. తమ శత్రువులకు, వారి మిత్రపక్షాలకు చెంది...