భారతదేశం, మార్చి 22 -- పశ్చిమ ఆసియా (Middle East) లో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య దాడులు ప్రతిదాడులు తీవ్రరూపం దాల్చడం, అంతర్జాతీయ చమురు సరఫరాకు కీలకమైన హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తామని ఇరాన్ హెచ్చరించడం వంటి పరిణామాలు భారత్‌కు సవాలుగా మారాయి. ఈ నేపథ్యంలో, దేశ ఇంధన భద్రతను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఒక కీలక సమావేశాన్ని నిర్వహించారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఒకానొక దశలో బ్యారెల్‌కు 119 డాలర్ల గరిష్ట స్థాయిని తాకడం, ప్రస్తుతం 109 డాలర్ల వద్ద కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ విధిస్తున్న దిగ్బంధనాన్ని కేవలం 48 గంటల్లోగా ఎత్తివేయకపోతే, ఆ దేశంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ...