భారతదేశం, ఆగస్టు 16 -- జ్యోతిష్య శాస్త్రంలో నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. సూర్యుడిని ఆత్మవిశ్వాసం, కీర్తి ప్రతిష్టలు, నాయకత్వ పటవాలు, ఉన్నతాధికారం మరియు పితృకారకుడిగా భావిస్తారు. జాతకంలో ఆదిత్యుని స్థితి బలంగా ఉంటే సమాజంలో గౌరవ మర్యాదలు, ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. సూర్యుడు రాశి మారినప్పుడల్లా దాని ప్రభావం ద్వాదశ రాశులన్నింటిపై స్పష్టంగా కనిపిస్తుంది.

ఈ క్రమంలో ఆగస్టు 17, 2026న సూర్యభగవానుడు కర్కాటక రాశి నుంచి నిష్క్రమించి.. తన సొంత రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. సూర్యుడు తన స్వరాశిలో సుమారు నెల రోజుల పాటు కొలువుదీరనున్నాడు. స్వరాశిలో రవి సంచారం చేయడం జ్యోతిష్యపరంగా అత్యంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు.

ఈ సంచార ప్రభావంతో ముఖ్యంగా మూడు రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాల్లో ...