భారతదేశం, మార్చి 18 -- ప్రస్తుతం భారత స్టాక్ మార్కెట్లు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకవైపు కఠినమైన అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు, మరోవైపు పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధం.. వెరసి ఇన్వెస్టర్ల సంపద ఆవిరవుతోంది. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ షేర్లు శిఖరం నుంచి నేలకు దిగివస్తున్నాయి. పోర్ట్‌ఫోలియోలు ఎర్రబడటంతో సామాన్య ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. మరి ఈ పతనాన్ని చూసి భయపడాలా? లేక పెట్టుబడికి సరైన సమయంగా భావించి 'షాపింగ్' మొదలుపెట్టాలా? దీనిపై సీనియర్ అనలిస్టుల అభిప్రాయం ఏంటో చూద్దాం.

భారత్ తన ఇంధన అవసరాల కోసం (చమురు, గ్యాస్) పశ్చిమాసియా దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. అక్కడి యుద్ధ పరిస్థితులు సరఫరా వ్యవస్థను దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీనికి తోడు అంతర్జాతీయ వాణిజ్య ఆంక్షలు తోడవ్వడంతో మార్కెట్లలో 'బేరిష్' ధోరణి కనిపిస్తోంది. ఇండెక్స్‌లు పడిపోయే దానికం...