భారతదేశం, సెప్టెంబర్ 7 -- అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు వ్యవహారం వివాదానికి దారితీసింది. బ్లాక్ టీషర్ట్ ధరించి.. అసెంబ్లీలోకి వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై తాతా మధు బూతులు తిట్టారని, పోలీసులను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారని మంత్రులు, కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కతోపాటుగా మరికొందరు స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై ఆరా తీసినట్టుగా తెలుస్తోంది.

తెలంగాణ శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి పొన్నం అన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం ఏమాత్రం సమర్థనీయం కాదని, తాతా మధు వ్యాఖ్యల పట్ల స్పీకర్ గడ్డం ప...