భారతదేశం, మే 20 -- హిందూ ధర్మంలో పవిత్రమైన వ్రతం స్కంద షష్టి. ఈ వ్రతం పరమశివుడు, పార్వతీదేవి పెద్దకొడుకు, దేవసేనాధిపతి అయినటువంటి కార్తికేయ స్వామికి అంకితం చేయబడింది. ప్రతి నెలలో కూడా శుక్లపక్ష షష్టి నాడు స్కంద షష్టి జరుపుకుంటాము. భక్తిశ్రద్ధలతో ఈ ఉపవాసం ఉన్నట్లయితే కార్తికేయుని అనుగ్రహం కలిగి కష్టాల నుంచి బయటపడవచ్చు. ధైర్యం, విజయాలు లభిస్తాయని కూడా విశ్వాసం. అధిక జ్యేష్ఠ మాసంలో స్కంద షష్టి ఎప్పుడు వచ్చింది? తేదీ, శుభ ముహూర్తంతో పాటు వ్రత విధానం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

పంచాంగం ప్రకారం చూసినట్లయితే, అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్ష షష్టి తిథి మే 21, అనగా రేపు ఉదయం 8:27కి ప్రారంభమవుతుంది. మే 22 ఉదయం 6:25తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూసినట్లయితే, స్కంద షష్టి వ్రతాన్ని మే 21, అనగా రేపు ఆచరించాలి.

ఈ మంత్రాన్ని జపించడ...