భారతదేశం, జూన్ 15 -- నేడు (జూన్ 15, 2026, సోమవారం) ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పరంగా అత్యంత విశిష్టమైన రోజు. జ్యేష్ట అధికమాసం చివరి రోజు కావడం, దానికి తోడు సోమవతి అమావాస్య, మిథున సంక్రాంతి ఒకే రోజు రావడం అత్యంత అరుదైన కలయిక. పంచాంగకర్తల ప్రకారం, ఇలాంటి అరుదైన యోగం దాదాపు 396 ఏళ్ల క్రితం, అంటే జూన్ 10, 1630న ఏర్పడింది. మళ్ళీ ఇటువంటి అద్భుతమైన సంయోగం 2327వ సంవత్సరం వరకు రాదు.

హిందూ ధర్మంలో అమావాస్య పితృదేవతల ఆరాధనకు, సోమవారం శివారాధనకు, అధికమాసం విష్ణు ఆరాధనకు అత్యంత పవిత్రమైనవి. సంక్రాంతి రోజున సూర్యుడిని ఆరాధించడం ఆచారంగా వస్తోంది. ఇలా ఒకే రోజున పితృ తర్పణం, శివ పూజ, విష్ణు ఆరాధన, సూర్య ఉపాసన చేయడం వల్ల లభించే పుణ్యఫలం అక్షయంగా (ఎప్పటికీ తరగనిది) ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఖగోళ శాస్త్రం ప్రకారం, అమావాస్య రోజున సూర్యుడు, చంద్రుడు, ...