భారతదేశం, జూన్ 14 -- జూన్ 15న సోమవతి అమావాస్య. హిందూ ధర్మం, జ్యోతిష్య శాస్త్రంలో ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. అమావాస్య తిథి పితృదేవతలకు అంకితం కాగా, సోమవారం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రెండు కలిసి రావడం వల్ల సోమవతి అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ రోజున చేసే దానధర్మాలు, పూజలు అనంతమైన ఫలితాలను ఇస్తాయని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా గోధుమ పిండితో చేసే కొన్ని జ్యోతిష్య పరిహారాలు కుటుంబంలో సుఖశాంతులను చేకూర్చడమే కాకుండా, ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాయని ప్రతీతి. ఆ పరిహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సోమవతి అమావాస్య రోజు ఉదయాన్నే గోధుమ పిండితో చిన్న చిన్న ఉండలు చేసి, సమీపంలోని నది, చెరువు లేదా కాలువలో ఉన్న చేపలకు తినిపించడం ఒక గొప్ప సాంప్రదాయం. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, ఆర్థిక పరమైన సమస్యలు క్రమంగా తగ్...