భారతదేశం, ఆగస్టు 29 -- సెప్టెంబర్ 2న పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరుకోనున్నాయి. విశాఖపట్నం ప్రాంత అవసరాల కోసం దాదాపు 27 టీఎంసీల నీటిని నిల్వ చేసి పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సీతారాంపురం - పి.ఎల్. పురం వద్ద ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు జల హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ రోజున ఈ ప్రాంతానికి నీరు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.

జనాభా, పారిశ్రామిక కార్యకలాపాలు విస్తరిస్తున్న తరుణంలో నీటి వనరులు అవసరమైన విశాఖపట్నానికి ఈ నీటి మళ్లింపు ఎంతో కీలకం కానుంది. పోలవరం నీటిని కేవలం కాలానుగుణ సరఫరా లాగా మాత్రమే కాకుండా.. వైజాగ్ దీర్ఘకాలిక అవసరాలను తీర్చేలా నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ఈ ప్రణాళిక ఉద్దేశం.

ఎడమ కాలువ ద్వారా తీసుకురానున్న నీటిలో, ...