భారతదేశం, మార్చి 19 -- ముంబై: భారత స్టాక్ మార్కెట్ గురువారం ఉదయం భారీగా పతనమైంది. గత మూడు రోజులుగా లాభాల బాటలో పయనించిన సూచీలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడం, ముడి చమురు ధరలు భగ్గుమనడం వంటి అంతర్జాతీయ పరిణామాలతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు మొగ్గు చూపారు.
నేటి ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 2,000 పాయింట్లు (సుమారు 3%) మేర నష్టపోయి 74,685 కనిష్ఠ స్థాయికి పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 600 పాయింట్లు (2.5%) క్షీణించి 23,180 వద్దకు చేరుకుంది. ఈ భారీ పతనం వల్ల ఇన్వెస్టర్ల సంపద కేవలం కొన్ని గంటల్లోనే రూ. 7 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్ఈ (BSE)లో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 439 లక్షల కోట్ల నుంచి రూ. 432 లక్షల కోట్లకు పడిపోయింది.
స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసిన 4 ప్రధాన కారణాలు ఇవే:
ఫిబ్రవరి 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.