భారతదేశం, మార్చి 13 -- భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) సాంకేతికత దిశగా మరో భారీ అడుగు వేసింది. కేసుల జాబితా తయారీ (Case Listing), ధర్మాసనాల కేటాయింపు (Bench Allocation) ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వ్యవస్థను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. దీనివల్ల కేసుల కేటాయింపులో మానవ ప్రమేయం పూర్తిగా తొలగిపోనుంది.

సాధారణంగా సుప్రీంకోర్టులో 'మాస్టర్ ఆఫ్ ది రోస్టర్' (Master of the Roster) హోదాలో ప్రధాన న్యాయమూర్తే ఏ కేసును ఏ బెంచ్ విచారించాలో నిర్ణయిస్తారు. అయితే ఇటీవల రిజిస్ట్రీలో కొన్ని లోపాలు బయటపడ్డాయి:

దీనిపై సీజేఐ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇకపై కేసుల కేటాయింపులో మనుషుల ప్రమేయం లేకుండా పూర్తి ఏఐ వ్యవస్థను తీసుకురావాలని ఆదేశించారు.

"మేము ఏఐని అత్యంత ఆశాజనకమైన, నిర్మాణాత్మకమైన పద్ధతిలో ఉపయోగిస్తున్నాం. ఇం...