భారతదేశం, ఫిబ్రవరి 23 -- స్టాక్ మార్కెట్‌లో ఒకప్పుడు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించిన మల్టీబ్యాగర్ స్టాక్ సుజ్లాన్ ఎనర్జీ ప్రస్తుతం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. నిఫ్టీ, సెన్సెక్స్ వంటి బెంచ్‌మార్క్ సూచీలు లాభాల్లో ఉన్నప్పటికీ, ఈ షేరు మాత్రం అమ్మకాల ఒత్తిడికి లోనై సోమవారం (ఫిబ్రవరి 23, 2026) నాడు ఏడాది కనిష్టానికి చేరింది. సోమవారం రూ. 43.85 వద్ద ట్రేడైంది. 2025 మే నెలలో గరిష్టంగా రూ. 74.30 వద్ద ట్రేడైంది. గడిచిన 3 నెలల కాలంలో 20 శాతం నష్టపోయింది. అయితే గడిచిన 5 ఏళ్లలో ఈ స్టాక్ ఇన్వెస్టర్లకు 816 శాతం లాభాలు ఇచ్చింది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సుజ్లాన్ ఎనర్జీ ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగానే ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో (Q3) కంపెనీ పనితీరు ఇలా ఉంది.

ఇన్ని సానుకూల అంశాలు ఉన్నప్పటికీ, ఎగ్జిక్యూషన్ సవాళ్లు (ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయ...