భారతదేశం, మార్చి 7 -- గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్‌కు భారీ ఆర్థిక వెసులుబాటు కల్పించే కొత్త వేతన ఒప్పందాన్ని కంపెనీ సిద్ధం చేసింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం, రాబోయే మూడేళ్లలో పిచాయ్ దాదాపు 692 మిలియన్ డాలర్ల వరకు ఆర్జించే అవకాశం ఉంది.

సుందర్ పిచాయ్ శాలరీ స్ట్రక్చర్ పరిశీలిస్తే, అందులో నగదు రూపంలో వచ్చే జీతం కంటే షేర్ల వాటానే ఎక్కువగా ఉంది.

వేమో నుంచి 130 మిలియన్ డాలర్లు, వింగ్ నుంచి 45 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఆయనకు దక్కే అవకాశం ఉంది.

ఈ 692 మిలియన్ డాలర్ల మొత్తం పిచాయ్‌కు నేరుగా చేతికి రాదు. ఇది పూర్తిగా సదరు కంపెనీల షేర్ల విలువ, మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత లక్ష్యాలను చేరుకోలేకపోతే ఈ మొత్తం తగ్గే అవకాశం కూడా ఉంది.

మరో ముఖ్యమైన ...