భారతదేశం, ఫిబ్రవరి 27 -- ఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత సహా 22 మందిని రౌస్ అవెన్యూ కోర్టు శుక్రవారం డిశ్చార్జ్ చేసింది. అయితే, ఈ తీర్పు సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) అనుసరించిన తీరుపై న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఛార్జిషీట్‌లో నిందితులను ఉద్దేశించి సీబీఐ పదేపదే 'సౌత్ గ్రూప్' (South Group) అనే పదాన్ని వాడటంపై ప్రత్యేక జడ్జి జితేందర్ సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేవలం ప్రాంతం లేదా నివాస స్థలం ఆధారంగా నిందితులకు ఇలాంటి పేర్లు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

"ఇదే ఛార్జిషీట్ గనుక చెన్నై కోర్టులో దాఖలై ఉంటే, అక్కడి వారు దీన్ని అవమానకరంగా భావించేవారు" అని న్యాయమూర్తి మౌఖికంగా...