భారతదేశం, జూలై 15 -- సీబీఎస్‌ఈ (CBSE) ఈ విద్యా సంవత్సరం (2026-27) నుంచి ఆరో తరగతి నుంచి ప్రవేశపెట్టిన నూతన మూడు భాషల విధానంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తగినన్ని పాఠ్యపుస్తకాలు, ఉపాధ్యాయుల కొరతను పేర్కొంటూ దేశవ్యాప్తంగా పలువురు తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహన్ రామ్‌లతో కూడిన ఈ బెంచ్.. ఐదు, ఆరో తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు దాఖలు చేసిన రెండు కొత్త పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. పాఠశాలల్లో మౌలిక వసతులు, తగినంత సిబ్బంది లేకపోవడం వల్ల ఈ విధానాన్ని అమలు చేయడం అసాధ్యమని పిటిషనర్లు ...