భారతదేశం, జూన్ 5 -- సీబీఎస్‌ఈ (CBSE) బోర్డు పరీక్షల్లో అదనపు ప్రశ్నలు రాసిన విద్యార్థుల మార్కుల మూల్యాంకనంపై వస్తున్న సందేహాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నివృత్తి చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటీసును బోర్డు తన వెబ్‌సైట్ cbse.gov.in లో అందుబాటులో ఉంచింది.

తమ సమాధాన పత్రాల (Answer books) స్కాన్డ్ కాపీలను పొందిన కొందరు విద్యార్థులు, కాలిక్యులేషన్ షీట్‌లోని మార్కులకు, తమకు వచ్చిన మొత్తం మార్కులకు తేడాలు ఉన్నట్లు బోర్డు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ఉన్న అపోహలను తొలగించడానికి సీబీఎస్‌ఈ ఈ వివరణ ఇచ్చింది.

ప్రశ్నాపత్రాల్లో ఇంటర్నల్ ఛాయిస్ (Internal choices) ఉండటం వల్ల విద్యార్థులు నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో, విద్యార్థి రాసిన అన్ని సమాధానాలలో దేనికైతే అత్యధిక...