భారతదేశం, ఆగస్టు 27 -- Mir Alam Cheruvu Development Works : పాతబస్తీలోని చారిత్రక మీరాలం ట్యాంక్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా సాగుతున్న వివిధ అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఆకస్మికంగా పర్యటించిన ఆయన.. క్షేత్రస్థాయిలో జరుగుతున్న నిర్మాణాలు, ప్రణాళికలను సుదీర్ఘంగా సమీక్షించారు.

మీరాలం చెరువు పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్-టాప్ జీపులో ప్రయాణించి పరిశీలించారు. చెరువు చుట్టూ జరుగుతున్న బ్యూటిఫికేషన్, మౌలిక వసతుల కల్పన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం. మీరాలం చెరువుపై ప్రత్యేక ఆకర్షణగా నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్ నిర్మాణ ప్రాంతాని...