భారతదేశం, మార్చి 14 -- న్యూఢిల్లీ: దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. గ్యాస్ పైప్‌లైన్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని సుమారు 60 లక్షల కుటుంబాలు పీఎన్‌జీ (Piped Natural Gas) వైపు మొగ్గు చూపాలని పెట్రోలియం మంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక ప్రకటనలో కోరింది. దీనివల్ల సిలిండర్ల కోసం బుకింగ్ చేసుకోవడం, డెలివరీ కోసం వేచి చూడటం వంటి ఇబ్బందులు తప్పుతాయని ప్రభుత్వం పేర్కొంది.

ప్రస్తుతం దేశంలో 1.5 కోట్ల మంది పీఎన్‌జీ వినియోగదారులు ఉన్నారని, వారికి ఎటువంటి అంతరాయం లేకుండా గ్యాస్ అందుతోందని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ తెలిపారు. "మరో 60 లక్షల ఇళ్లకు పీఎన్‌జీ పైప్‌లైన్లు అతి సమీపంలో ఉన్నాయి. వారు చాలా సులభంగా కనెక్షన్ పొందవచ్చు. ఇది ఎల్పీజీపై ఉన్న ఒత్తిడిని తగ్గిస్తుంది" అని...