భారతదేశం, సెప్టెంబర్ 5 -- Ee Paata Korinavaru Nemalipalem Nundi Rama Jyotsna Nandu Murali Kabir Dhol Ravi Modalaguvaru: 'ఆ నలుగురు', 'మధుమాసం', 'అందరి బంధువయా', "ఇదీ సంగతి", 'ఆటగదరా శివా' తదితర చిత్రాలతో విలక్షణమైన దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్.

దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ తాజాగా తెరకెక్కించిన చిత్రం 'ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు'. దీనికి 'ఏ ఫర్‌బిడెన్ రాగ ఫ్రమ్ ఏ ఫర్‌బిడెన్ సాగా' అనేది క్యాప్షన్.

ఫిల్మోత్సవ్ బ్యానర్‌పై డైరెక్టర్ చంద్ర సిద్ధార్థ్ సొంతగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ దర్శక రచయిత మదన్ అందించిన కథతో ఈ సినిమా రూపొందింది. హర్ష హీరోగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో అమైరా గోస్వామి, సుజనా రెడ్డి, బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా,...