భారతదేశం, ఆగస్టు 2 -- Secunderabad Mahankali Bonalu 2026 : సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 మహోత్సవం ఘనంగా ప్రారంభమైంది. ఇవాళ్టి నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్న ఈ జాతరకు నగర నలుమూలల నుంచే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం, వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులను అమల్లోకి తెచ్చారు.

ఆగస్ట్ 1 అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన ట్రాఫిక్ ఆంక్షలు.. ఆగస్టు 4వ తేదీ ఉదయం 3:00 గంటల వరకు అమల్లో ఉంటాయి. మహంకాళి ఆలయానికి సమీపంలో ఉన్న పొగాకు బజార్, హమాలీ విగ్రహం, సుభాష్ రోడ్, హిల్ స్ట్రీట్, జనరల్ బజార్ తదితర రహదారుల్లోక...