భారతదేశం, జూన్ 21 -- ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దర్యాప్తు బృందం.. సాయికృష్ణను అదుపులోకి తీసుకోవడంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు అనుసరించిన అక్రమ పద్ధతులపై పక్కా ఆధారాలను సేకరించింది. ముఖ్యంగా, మార్కాపురం నుండి విజయవాడ వరకు సాగిన సాయికృష్ణ తరలింపు ఎపిసోడ్‌పై పోలీసులు ప్రస్తుతం ప్రత్యేకంగా దృష్టి సారించారు.

నమ్మలేని నిజాలు ఈ విచారణలో బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లా మార్కాపురానికి విజయవాడ టాస్క్‌ఫోర్స్ సబ్-ఇన్‌స్పెక్టర్ నవీన్‌తో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఎవరికీ తెలియకుండా రహస్యంగా వెళ్లినట్లు ఉన్నతాధికారులు గుర్తించారు. అక్కడ సాయికృష్ణను అదుపులోకి తీసుకున్న ఈ బృందం.. పోలీస్ స్టేషన్...