భారతదేశం, జూలై 9 -- మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం చూసినట్లయితే, 24 గంటల కాలాన్ని వివిధ భాగాలుగా విభజించడం జరిగింది. ప్రతి కాలానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఆ సమయాల్లో పాటించాల్సిన నియమాలను కూడా శాస్త్రాలు వివరించాయి. ఉదయం నుంచి ప్రదోషకాలం వరకు, సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రతి సమయానికి ఏదో ఒక ప్రత్యేకతతో పాటు ఆధ్యాత్మిక విశిష్టత కూడా ఉంది.

సూర్యాస్తమయం, ప్రదోషకాలాన్ని అత్యంత పవిత్రమైన, సున్నితమైన సమయంగా భావిస్తారు. సాయంత్ర వేళను మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన సమయంగా చెబుతారు. ఈ సమయంలో పాటించాల్సిన అనేక వాస్తు నియమాలు ఉన్నాయి. అయితే, సాయంత్రం పూట నిద్రపోకూడదని పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. సాయంత్రం సంధ్యా సమయంలో నిద్రపోకూడదని, ఇల్లు చీకటిగా ఉండకూడదని, ఇలా చాలా నియమాలు ఉన్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు కొన్ని జా...