భారతదేశం, ఆగస్టు 3 -- భారత ప్రాథమిక మార్కెట్​లో జులై 30న ప్రారంభమైన 'ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ లిమిటెడ్' పబ్లిక్ ఇష్యూ నేటితో (ఆగస్టు 3, 2026) ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా ఈక్విటీ షేరు రూ.400 నుంచి రూ.425 ప్రైస్ బ్యాండ్‌గా కంపెనీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ బుక్-బిల్డింగ్ ఇష్యూలో పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లకు ఈరోజే చివరి అవకాశం.

రూ.290 కోట్ల నిధులను సేకరించడమే లక్ష్యంగా కంపెనీ నూతన షేర్లను జారీ చేస్తోంది. మరోవైపు, ఐపీఓ సబ్‌స్క్రిప్షన్‌కు విశేష స్పందన లభిస్తుండటం, సెకండరీ మార్కెట్‌లో సానుకూల ధోరణి కనిపిస్తుండటంతో గ్రే మార్కెట్‌లోనూ ఈ షేర్ల డిమాండ్ పెరిగింది.

ఇన్వెస్టర్‌గెయిన్ సమాచారం ప్రకారం.. గ్రే మార్కెట్‌లో ఎంవీ ఎలక్ట్రోసిస్టమ్స్ షేర్లు నేడు రూ.120 ప్రీమియంతో అందుబాటులో ఉన్నాయి. గురువారం బిడ్డింగ్ ప్రారంభం కాకముందు ఉన్న జీఎంపీతో పోలిస్...