భారతదేశం, సెప్టెంబర్ 10 -- హైదరాబాద్‌లోని సచివాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. నిరుపేదలకు అత్యవసర వైద్య సహాయం అందించే ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కు విడుదల కోసం లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ సిటీ రేంజ్-2 అధికారులు గురువారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ విడుదల చేసిన ప్రకటనలోని వివరాల ప్రకారం.. సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న ఆనందేషి రాఘవేందర్ (AO-1), బషీర్‌బాగ్ పరిశ్రమల భవన్‌లోని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (TSIDC) కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మేడి వినోద్ (AO-2) ఈ అవినీతికి పాల్పడ్డారు.

బాధితుడికి సీఎంఆర్‌ఎఫ్ పథకం కింద మంజూరైన రూ. 2,00,000 వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ చెక్కును ఇచ్చేందుకు, మిగిలిన క్లెయిమ్‌ను ప్రాస...