భారతదేశం, ఆగస్టు 19 -- ఈ-కామర్స్ ఎనేబుల్‌మెంట్ ప్లాట్‌ఫామ్ 'షిప్‌రాకెట్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్లో అదరగొట్టింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు ఐపీవో ధర కంటే 35 శాతం భారీ ప్రీమియంతో మార్కెట్లో నమోదయ్యాయి. ఇన్వెస్టర్లకు తొలి రోజే ఐపీవో ఆఫర్ ధరకు మించి ఆకర్షణీయమైన లాభాలను అందించింది.

ఎన్‌ఎస్‌ఈ (NSE) లో షిప్‌రాకెట్ షేరు ఐపీవో ధర Rs.97 కంటే 35 శాతం పెరిగి Rs.131 వద్ద ప్రారంభమైంది. బిఎస్‌ఈ (BSE) లో 33.51 శాతం ప్రీమియంతో Rs.129.50 వద్ద ట్రేడింగ్ మొదలైంది. మార్కెట్ వర్గాల అంచనాలకు అనుగుణంగానే ఈ లిస్టింగ్ నమోదైంది. లిస్టింగ్‌కు ముందు గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) Rs.35 వద్ద ఉండటంతో, షేరు ధర Rs.132 వరకు నమోదయ్యే అవకాశం ఉందంటూ విశ్లేషకులు ముందుగానే భావించారు.

కంపెనీ తమ ఐపీవో ధరల శ్రేణిని Rs.92 నుంచి Rs.97 గా నిర్ణయించింది. ఈ ఐపీవో ద్వారా...